Monday 12 March 2012

పేమ రాహిత్యంలో నాలుగు ముఖాల సంచలనం

Posted By on July 9, 2009
శిలాలోలిత
మాధవి కుట్టి ఒక సీతాకోకచిలుక, కమల ఒక మంచుకొండ, కమలాదాస్‌ ఒక లావా ప్రవాహం. కమలా సురయ్యా ఒక అగ్నికణం. బతుకంతా అన్వేషణలోనే అలసి సొలసిన బాధాగ్ని రేణువు
అమ్మా-నాన్నలు, మేనమామల సాహిత్య సృజనను చిన్నప్పటినుంచీ దగ్గరగా చూస్తుండటంతో, సాహిత్యప్రేమ మొదలైంది. ఆమె తొమ్మిదవ ఏట పిల్లల కథను రాశారు. కవిత్వమంటే పిచ్చి ప్రేమ ఉండేది. కానీ ఫక్తు వ్యాపారవేత్త భర్త దృష్టిలో, కవిత్వం రాయడం వల్ల ఎక్కువడబ్బులు రావు. మార్కెట్‌ లేదు. సెన్సేషన్‌ వున్న రచనలు కథ, నవల, వ్యాసం ఆత్మకథల్లాంటివైతే డబ్బులు రాల్తాయనేది అతని వాదన. కమలలో రెండు యుద్ధభూములున్నాయి. రోజూ కత్తులు దూసుకోవడమే. భర్తకున్న ధనకాంక్ష, ఆజ్ఞాపించే ధోరణికి అలవాటు పడిపోయినా, ఏసెన్సారింగు తనకు తాను విధించుకోని తత్వం ఆమెలో వున్నందువల్ల చాలా స్వేచ్ఛగా రాసింది.
15 సం||లకే పెళ్ళయి, 16 ఏళ్ళకే తల్లయినందున బాధ్యతలు, కుటుంబంలో కూరుకుపోయింది. మానసికంగా సంసిద్ధత దశకు చేరుకోని దశలోనే భర్త లైంగిక ప్రవృత్తి, మొరటుదనం ఆమె శరీరాన్నే కాక మనసునూ గాయాలపాలు చేసింది. ‘స్టాక్‌ వెరిఫికేషన్‌’ కవితలో భర్త మరణాన్ని అత్యంత దగ్గరగా చూసిన తీవ్రతను రాస్తూనే ‘కాళ్ళ మధ్య ఓ మనిషిని బిగబట్టి ముగ్గురు కొడుకుల్ని బయటికి తెచ్చాను” అని వేదాంతిలా అంటారు.
”పిల్లల్తో పాటూ నేనూ పెరిగాను, ఆడుకున్నాను. నా భర్తకూ నాకు సంవత్స రాల దూరం చాలా ఉన్నందున పిల్లల్లా నేనూ పేచీలు పెట్టాను’ అంటుందొకచోట. మనిషి బతికున్నాడన డానికి నిదర్శనం కోల్పోని చిరునవ్వు, పసితనమే. ఈ రెండూ ఆమెలో చివరి వరకూ ఉన్నాయి. అందుకే ఆమె రచనల్లో ఆ సహజత్వం, నిర్మలత్వం, ధైర్యం, వాదనాపఠిమ నిరంతరం కొనసాగుతూనే వున్నాయి.
కమలాదాస్‌ ‘మై స్టోరీ’ ఆత్మకథ సాహిత్యరంగంలో తీసుకొచ్చిన సంచలనం మనకు తెలిసిందే. దేశభాషను, ప్రకంపనాలను, విస్ఫోటనాలను ఎంతో నిజాయితీగా భావోద్వేగంగా రచించిన ఆనందాన్వేషి. పిడికెడు ఆనందం కోసం, గుప్పెడు ప్రశాంతత కోసం, చారెడు రసానుభూతికోసం, బారెడు ప్రేమకోసం, పరిశ్రమించిన అన్వేషించిన నిరంతర చలనశీలి ఆమె. కానీ బతుకంతా అన్వేషణే మిగిలింది. ప్రేమగా చూసే వ్యక్తులు తారస పడలేదు. దేహవాంఛే ప్రధానమనుకుంటు న్నారే కానీ, మనస్సూ దేహము ఏకకాలము లో భావోద్వేగ కెరటాన్ని ఒరుసుకుంటూ ప్రవహించే, రాగరంజితం చేసే స్థితికోసం ‘మృగన’ గానే మిగిలిపోయింది. తనలోని మనసుతో, తనకున్న దేహంతో, తనదైన జీవితంలో, తన మేధస్సుతో పెనుగులాడే ఆమె రచనలు. తను అనుకున్న దానిని ఎంతో ధైర్యంగా ప్రకటించే తత్వమామెది. మనం జాగ్రత్తగా గమనిస్తే, సెన్సేషన్‌ కోసం ఆమె రాయలేదు. కానీ, ఆమె రాసినందా సెన్సేషన్‌ అయింది.
కమలాదాస్‌ కవిత్వానికి ఓ మచ్చుతునక మాత్రమే ఈ కవిత. చర్చించడం మొదలుపెడితే ఆ చర్చ అనంతంగా సాగిపోతుంది.
”పురుగులు” – కమలాదాస్‌
నదీతీరంలో, సూర్యాస్తమయవేళ
ఆమెతో కృష్ణుని చివరి సంగమం…
ఆరాత్రి భర్త కౌగిలిలో రాధ నిర్జీవంగా…
”ఏమయింది”…?
”చెలీ నా ముద్దులు నీకు రుచించడం లేదా?”
”అబ్బే అదేం లేదు?” ఆమె జవాబు
కానీ, ”పురుగులు కొరికితే శవానికి నొప్పి తెలుస్తుందా”?
ఆమెలో సుళ్ళు తిరుగుతుందో ప్రశ్న….
(- అనువాదం : పసుపులేటి గీత)
ఆమె ఎన్నో అవార్డులను గెలుచు కుంది. జాతీయ అంతర్జాతీయ పురస్కారాల నేకం పొందారు. అనేక భాషల్లోకి రచనలు అనువాదమయ్యాయి.
కేరళలోని మలబారు తీరంలో త్రిసూర్‌ జిల్లాలో వున్న యురుక్కుళంలో 31.03.1932లో జన్మించింది. 31.05.2009లో ఆదివారం నాడు పూణే లోని జహంగీర్‌ ఆస్పత్రిలో, శ్వాస సంబంధిత వ్యాధితో బాధపడ్తున్న ఆమె తుదిశ్వాసను విడిచారు. 75 ఏళ్ళపాటు జీవించిన ఆమె అంతరంగ చిత్రాలే రచన రూపాన్ని తొడుక్కొని, అక్షరాలుగా మనముందు నిలిచాయి.
‘వంశస్థులు’ కవితలో ఆమె మాటలు – ”నేను మరణించినప్పుడు నా మాంసాన్ని ఎముకల్ని విసిరిపారేయకండి. వాటిని ప్రోదిచేయండి. వాటి వాసనతో వాటిని చెప్పనివ్వండి. ఈ భూమ్మీద జీవితపు విలువేమిటో, అంతిమంగా ప్రేమ విలువేమిటో వాటినే చెప్పనివ్వండి”.

Tuesday 7 February 2012

సాహితీ సముద్రతీరాన – చిల్లర భవానీదేవి కవిత్వం

సాహితీ సముద్రతీరాన – చిల్లర భవానీదేవి కవిత్వం

Posted By on April 4, 2010
శిలాలోలిత
డా. చిల్లర భవానీ దేవి గత పాతికేళ్ళకుపైగా కవిత్వం రాస్తున్నారు. నిరంతర ప్రవాహగుణం ఆమె కవిత్వ లక్షణం. తొలికవితా సంపుటి 1986లో నాలోని నాదాలు. 93లో గవేషణ, 96లో శబ్దస్పర్శ, 2001లో వర్ణనిశి, 2004లో భవానీ నానీలు, 2006లో అక్షరం నా అస్తిత్వం, 2007లో హైదరాబాద్‌ నానీలు మొదలైన కవిత్వ సంపుటులను ప్రచురించారు.
అలాగే రెండు కధా సంపుటాలు, అంతరంగ చిత్రాలు 96లో, అమ్మా!నన్ను క్షమించొద్దు…2008లో తీసుకొని వచ్చారు. ‘అధ్యయనం’2007లో, కవయిత్రుల నానీ’2007లో వ్యాస సంపుటాలుగా ప్రచురించారు. కవయిత్రిగా, రచయిత్రిగా, విమర్శకురాలిగా, వక్తగా తనకంటూ ఒక చిరపరిచిత స్థానాన్ని సాహితీలోకంలో ఏర్పరుచుకున్నారు. పుస్తక ప్రచురణల విషయంలో ఆమె కొంత మందికి స్ఫూర్తి కూడా.
రచనను ఒకకాలక్షేపంగానో, అలవాటుగానో, కీర్తికోసమో కాకుండా, ఒక కమిట్‌మెంట్‌ వున్న రచయిత్రిగా భవానీదేవి జిజీ చెప్పుకోవచ్చు. ఆమె రచనలే ఆవిషయాన్ని వెల్లడిస్తాయి. 2009లో వచ్చిన కొత్త కవిత్వ సంపుటి ‘కెరటం నా కిరీటం’ కవయిత్రి మాటల్లోనే వినాలంటే – ‘నా కవిత్వం బహిర్‌ అంతశ్చేతనల సమ్మిళితం. మూడున్నర దశాబ్దాలుగా ఇదే నా సంవేదన. పుట్టింది సముద్ర తీరం. అదే నా జీవితానికీ కవిత్వానికీ బ్యాక్‌డ్రాప్‌. సముద్రంలో ఉన్నవన్నీ నాలోనూ వున్నాయి. మనుషుల్ని ప్రేమించడం నేర్పినందుకు సముద్రానికి నా కృతజ్ఞతలు.  ప్రపంచం పాడవటానికి బయటి కాలుష్యం కంటే భావకాలుష్యమూ ఒక కారణం. నిజానికి బయటి కాలుష్యానికి ప్రతిబింబం. అలాగే కవిత్వం కూడా అన్ని రకాల కాలుష్యాలను క్షాళితం చేయాలని నా అభిప్రాయం’- అంటూ వెల్లడించారు. ఈ పుస్తకాన్ని తన ఆత్మీయ మిత్రురాలైన ‘పూడిగిరిజ’కు అంకితమిచ్చారు.
ప్రస్తుతం హైదరాబాద్‌లో నివసిస్తున్న ఈ కవయిత్రి సచివాలయంలో ఉన్నత పదవిలో వున్నారు. ఉద్యోగ బరువు బాధ్యతల్లో తనను వెన్నంటి వున్న వెన్నెల కవిత్వమని ఆమె భావన. మానవత్వం తన కవిత్వతత్వమంటున్నారు.
‘ఉరకలెత్తె నదిని నేను/కన్నీటి పడవనూ నేనే/నడిపే సరంగునూ నేనే/నా వైపు పరిగెత్తుకొచ్చే తీరాన్నీ నేనే/అందుకే కెరటం నా కిరీటం’ – స్త్రీ జీవన స్థితినీ, ఆకాంక్షల్నీ, బతుకు తత్వాన్ని అంతస్సూత్రాన్నీ కవిత్వీకరించారు. గత స్మృతుల్నీ తలచుకుంటూ-ఇన్నాళ్ళకు/సగం రాసి వదిలేసిన/బతుకు పుస్తకం దొరికిందివ్వాళ/ఇన్నేళ్ళకు/మనసు గుర్తుల్ని మరోసారి వెదుక్కుంటున్నాం’ ( ఈ క్షణంలో!) ‘రెండు కొండల దోసిట్లోంచి/ జగత్కల్యాణం సంకల్పంగా జారే గోదారి/ ఈ నీటి కుంచెల వర్ణ చిత్రాల్లో/ నా అక్షరాత్మల ఆకృతుల్ని వెదుక్కుంటున్నాను (పాపికొండలపాట)
సముద్ర గర్భంలో ఆల్చిప్పల శరీరం మధ్యలో మెరిసే ముత్యాల్లా, వెతికిన కొద్దీ దొరికే ముత్యాలు భవానీదేవి కవిత్వాలు. ముత్యం ఓ వర్షపు చినుకు. సరైన సమయంలో ఆల్చిప్ప మనసును గెలుచుకున్నప్పుడు, స్థిరీకృతరూపాన్ని సాధించుకోవడానికి చేసే  నిత్య యత్నంలో ఘన రూపాన్ని ఆపాదించుకుంటుంది. అలాగే, సముద్రతీరాన మనిషిగా పుట్టినా, మాటల మూటల్ని కవిత్వాలుగా మలిచే శక్తిని సముద్రం దగ్గరే నేర్చుకున్నారన్పించింది. కవిత్వాన్ని కవిత్వంగా ప్రేమించే సహృదయ పాఠకులందరూ మెచ్చే పుస్తకమిది. రాతిలో చెమ్మ, అద్దం – అనేక బింబాలు, రెండో ముఖం, ఈ రాత్రి, ఒక ఏకాంతం కోసం, కలలబేహారి, నాతోనే, లోపలినది, ఈ యుద్ధం ముగిసిందా? చిన్నప్పటిఫోటో, ప్రయత్నం హైఎలర్ట్‌, హెచ్చరిక, ఘనీభవనం ఇలా చదివించేగుణం ఆర్తి వున్న కవితలనేకం వున్నాయి.
స్త్రీ పురుషుల నిండైన జీవితం కోసం, సమ స్థితి కోసం ఎన్నో కవితల్లో రకరకాలుగా వ్యక్తీకరిస్తూనే వున్నారు. భ్రమకీ వాస్తవానికీ మధ్య/విభజన రేఖని స్పర్శించేది మనసే/ప్రేమించడం నా బలమైన బలహీనత /దాన్ని ఆవిరి చేయటం నీ నిర్వీర్యత/ఇప్పుడైనా/మన ఆభిజాత్యపు పొరల్నివొల్చుకుంటూ/ ఒకరిలోకి ఒకరుగా ప్రవహిస్తూ/ చీకటి ముసిరినప్పుడు మెరిసే  నక్షత్రాల్లా/కాసేపు చీకట్లోనే మాట్లాడుకుందాం/ హృదయనేత్రాల్ని విప్పార్చిచూసుకుందాం! (ప్రయత్నం)
చాలా మెత్తటి గొంతు ఈ కవయిత్రిది. నిరాడంబరమైన మాటల్లో, సున్నితమైన వ్యక్తీకరణతో, నచ్చజెప్పే ధోరణిలో కవిత్వముంటుంది. స్పష్టమైన అభిప్రాయాలతో, సామాజిక స్థితిగతుల పట్ల సరైన అవగాహన , అనుభవం వున్న కయిత్రి, ఈ చీకటి సమాజంలో వెన్నెల రావడంకోసం, తేవడం కోసం చేసిన యత్నమే ఈ కవిత్వం,  సముద్రం ఉప్పొంగిన గుండెతో పరవశించాలంటే వెన్నెలరేఖలే కావాలి. సమాజం ఉన్నత చైతన్యంతో వెలుగొందాలంటే, వెన్నెలలాంటి స్వచ్ఛమైన మానవ హృదయాలే కావాలన్న కవియత్రి భావగాఢతను ప్రశంసిస్తూ నిరంతరం ఇలానే కవిత్వాన్ని రాయాలని అభిలషిస్తున్నాను.

Friday 2 December 2011

పద్మలత పలవరింత, కలవరింత-’మరోశాకుంతలం’

భూమిక April 2010
శిలాలోలిత
శకుంతల ప్రకృతిలో పూచిన పువ్వు. అడవి సౌందర్యం ఆమె సొత్తు. కల్లాకపటం మాయామర్మం తెలీని, అణువణువున ప్రేమను నింపుకున్న అద్భుతమైన సౌందర్యాన్ని ప్రోది చేసుకున్న సీతాకోకచిలుక.కణ్వ మహర్షి ప్రేమామృత ధారలలో తడిపిన పద్మం. అలాంటి శకుంతల  దుష్యంతుని ప్రేమోద్దీపనలతో గొప్ప రసానందాన్ని అనుభవించింది. ప్రేమ తప్ప మరేదీ జీవితంలో శాశ్వతం కాదని నమ్మింది. తనను గుర్తించ నిరాకరించిన దుష్యంతునితో, ఆత్మగౌరవపోరాటం చేసింది. ఒక అద్భుతమైన వ్యక్తిత్వమున్న స్త్రీగా, ఆత్మాభిమానానికి నిదర్శనంగా  నిలిచింది. అలనాటి ఆ శకుంతల గాధే ఇప్పుడు ‘మరో శాకుంతలం’గా మన ముందుకొచ్చింది. ‘పద్మలత’ ఈ కవితాక్షరాలనన్నింటినీ ‘మరో శాకుంతలం’గా ఒక్క  చోట చేర్చి మననీ చూడమంది. అబ్బూరి ఛాయాదేవిగారు ఫోన్‌ చేసి ‘మరో శాకుంతలం’ మీద అభిప్రాయం రాయకూడదూ’ అన్నారు. పుస్తకం చేతిలోకి తీసుకోగానే, జింక పిల్లల్లాంటి, కుందేటి మెత్తని చర్మం లాంటి చేపపిల్లల కదలికల్లాంటి, పారిజాతపు పరిమళాల్లాంటి, పదునైన బాకుల్లాంటి, నలిగిన మల్లెపువ్వుల్లాంటి అక్షరాలు, ఉద్వేగ భరిత ఊహాలోకాల్లోకి, పద్మలత కవిత్వంలోకి లాక్కెళ్ళి పోయాయి. చాలాకాలం తర్వాత ఒక ఫ్రెష్‌ పొయిట్రిని చదివిన అనుభూతి కలిగింది. ‘రేవతీదేవి’ స్ఫురించింది. రేవతీదేవి 79 లో రాసిన ‘శిలాలోలిత’ కావ్యం తర్వాత మళ్ళీ 2010లో పద్మలత ఒక ఉద్వేగ సంభాషణను మన ముందుంచింది.
ఒక హృదయం, మరో హృదయాన్ని స్వచ్ఛంగా, ప్రేమోన్మత్తతతో ఆలింగనం చేసుకోవడానికి పడే తపన ఇందులో ప్రతి అక్షరంలోనూ కన్పించింది. రేవతీదేవి కవిత్వానికీ పద్మలత కవిత్వానికీ చాలా దగ్గర పోలికలున్నాయి. నిజాయితీగా నిర్భయంగా ఏ సెన్సారింగుకు లోబడకుండా, సంఘర్షణ నిండిన భావసంపదతో మనముందు కవిత్వాన్నుంచడం, శారీరక సంచలనాల సవ్వడులను మళ్ళీ మళ్ళీ అనుకోవడానికే తమ గుండెకు సైతం పరదాలేసుకునే ధోరణికాక, ఏ ఆచ్ఛాదనలు లేకుండా ఆరు బయట ఆకాశంకింద మెరిసే నక్షత్రాల్లాంటి నిజాయితీతో కూడిన అక్షరాలకు ప్రాణం పోశారు. ‘జీన్‌పాల్‌ సార్త్రే’ ప్రభావం రేవతీదేవి మీద బలంగా వుంది. పద్మలతలోనూ ఆ ఛాయలు కన్పించాయి.
ఈ ‘మరో శాకుంతలం’శీర్షికలు లేవు. అంతా ఒక శరీరమే ఒక నిర్మాణమే. కాని చెపుతున్న అంశానికి ప్రత్యేక కోణం మాత్రం వుంది. ఏ ఒక్కటీ విడివిడి కవితలుగా కాక, అన్నింటా ఏక సూత్రతే వుంది. కవిత్వమందామా? జీవితమందామా? కొన్ని లక్షల స్త్రీల హృదయాంతర్గత వేదనా రూపమందామా? ఏదైనా అనుకోవచ్చు. ఎవరికి కావలసిన అక్షరాన్ని, అర్ధాన్ని వాళ్ళు తీసుకోవచ్చు.
నిజానికి చిన్న చిన్న పదాలతో లోతైన భావాన్ని వ్యక్తీకరించడం చాలా కష్టం. పద్మలత చాలా మామూలు మాటల్తో, వాక్యాల్తో, ఉద్దీపన కలిగించే భావాల్తో, దేన్నయినా సాధించగలం అనే స్పష్టమైన అవగాహనతో ఈ కవిత్వం మనముందుంచింది. స్త్రీని బలహీన మనస్కురాలుగా కాక, ఒక బలమైన మనిషిగా, ఆత్మవిశ్వాసమున్న మూర్తిగా నిలిచిన ఎదిగిన క్రమాన్ని ఈ కవిత్వంలో పొదిగింది.
ప్రేమంటే ఏకపక్షం కాదనీ, కోరికంటే కేవలం కామవాంఛేకాదనీ, స్త్రీ పురుషులు ఒకరిపట్ల ఒకరు గొప్ప ప్రేమ భావనతో, సృష్టికందని ఆనందాన్ని పొందే గొప్ప రసైకచర్య అని భావించింది. ఆమెలోని వేదాంతి పైపై మెరుగుల మాలిన్యాలనన్నింటినీ క్షాళనం చేయాల్సిన అవసరాన్ని చెప్పింది. ప్రేమే జీవితానికి వెలుగు. ఈ సృష్టిలో డబ్బుతో దేన్నయినా సాధించవచ్చు అనుకుంటారు. కానీ కాదు. ప్రేమనూ, గురువునూ మాత్రం డబ్బుతో పొందలేం’ - ఇదే భావననూ, ప్రేమ రాహిత్యం మనిషినెంత ఉద్వేగానికి గురి చేస్తుందో ఈమె కవిత్వం చెబుతుంది. ఎంతో లలితమైన పదాలు పట్టుకుంటే, ముట్టకుంటే నొప్పి కలుగుతుందేమో అన్నంత భావసౌకుమార్యం, ప్రాచీన సాహిత్యాన్నీ,  చలం లాంటి ఆధునికుల్నీ తనలో ఇముడ్చుకున్న ఈ కవయిత్రి పలవరించినవన్నీ కవితలై  కూర్చున్నాయి. ఈమె కవిత్వంలో స్థలకాలాల పరిమితి లేదు. అందువల్ల శాశ్వతంగా  నిలిచే పోయే గుణం వచ్చింది.
గుండ్రంగా తిప్పి/కావాల్సినవైపు/కాస్తకాస్తగా/ కోసుకోవడానికి/ నేను మనిషిని.
వెలుతురొచ్చిన ఉత్సాహంతో/బుర్రంతా కడగానా/మనసే సాలిపురుగని తెలిసి/ఆ ప్రయత్నం విడిచాను.
ఆశ్చర్యం/మొసళ్ళ మధ్య ఈదుతూ నేనుంటే/ఆనందం ఆ ఒడ్డునచేరి/హాయిగా నవ్వుతోంది. ఇంకెంతలే/ అంతం లేని కాలంలో నేనెంత/ ఇవాళే నిజం కానపుడు/రేపటి గురించి/ వివాదమెందుకు.
నీవు విడిచివెళితే/ ఘనీభవించి/మళ్ళీ మనిషైయ్యాను.
ఓటమిని పద్మలత కవిత్వం అంగీకరించదు. అనేక పార్శ్యాలలో జీవితాన్ని దర్శించిన తర్వాత, ఆటుపోటులకు గురైన స్త్రీమూర్తి, తన జీవితాన్ని కాంతిమయం చేసుకున్న తీరును ఈ కవిత్వం ప్రతిఫలించింది. మనిషిగా జీవించడమే ప్రధానం. స్వేచ్ఛ ఆయువుపట్టు. ప్రేమ ఒక్కటే నిజం. జీవితం చాలా చిన్నది. ఎదురైన ఘర్షణలతో, అపజయాలతో ఎదురొడ్డి నిలిచి సాధించుకున్న వెలుగు జీవితానికర్ధం అన్న జీవన వాస్తవికతలనెన్నింటికో ఆలవాలమైంది ఈ కవిత్వం. సుకుమారమైన స్థితి నుండి ఘనీభవరూపం వరకు సాగిన మానవ యాత్రే ఈ కవిత్వం. మజిలీ మజిలీలో మనిషి సాధించుకోవాల్సిన జీవనమూల్యాన్ని తెలియజెపుతుంది ఈ కవి

Thursday 20 October 2011

ఆకుపచ్చని కల-రాజేశ్వరి దివాకర్ల కవిత్వం

ఆకుపచ్చని కల-రాజేశ్వరి దివాకర్ల కవిత్వం

భూమిక September 2010
శిలాలోలిత
”కవిత్వం అభిరుచికి సంబంధించిన విశిష్ట కళ. రాయకుండా ఉండలేక పోవడమే కవిత్వానికి మూలసూత్రం. వచన కవిత్వానికి నిర్దిష్ట సూత్రాలంటూ ఏమీ లేవు. అంతరంగ మథనమే వచన కవితకు ఆధారం”- రాజేశ్వరి దివాకర్ల.
ఇవే భావాలతో నిత్య నూతనమైన కవిత్వ రచనలో కొత్త కోణాలను దర్శించాలనే తపన రాజేశ్వరిగారి కవిత్వంలో కనిపిస్తుంది. 2009లో ‘భూమి తడిపిన ఆకాశం’ అనే కవిత్వ సంపుటిని తీసుకొని వచ్చారు.
ఈమె ఉభయ భాషా కవయిత్రి. మూడు దశాబ్దాలుగా బెంగుళూరులోని తెలుగు సాహిత్య రంగంలో సృజనాత్మకమైన పాత్రను పోషిస్తున్నారు. తెలుగు కన్నడాల గురించి తులనాత్మకమైన వ్యాసాలు రాశారు. ఇంతకు ముందు ‘నీరు స్తంభించిన వేళ, ‘నక్షత్ర దాహం’- కవిత్వ సంపుటులను తీసుకొచ్చారు.ఈ మూడింటి పేర్లతో ప్రకృతి, ఆకాశం,నక్షత్రాలు, నీరు, సమయం, స్తబ్ధత, తృష్ణ, పిపాస, భూమి, ఆర్ద్రత మొదలైనవన్నీ స్పష్టంగా కనిపిస్తున్నాయి.
కేంద్ర సాహిత్య అకాడెమీ వారి ‘భారతీయ సాహిత్య నిర్మాతలు’ మాలికలో ఈమె రచించిన ‘అక్క మహాదేవి’ ప్రచురితమైంది. అలాగే ‘బసవన్న సమగ్ర వచనాలు’ తెలుగు అనువాదాన్ని అంబికా అనంత్‌తో కలిసి చేశారు. స్త్రీ శరణుల వచనాలు’ అనువాదంలో భాగస్వామ్యం వహించారు. రాజేశ్వరి బసవ సమితి వారి ‘బసవ పథం’ త్రైమాసిక తెలుగు పత్రికకు ప్రధాన సంపాదకులుగా వున్నారు. ‘చైతన్య కవిత’ పత్రికకు చేదోడుగా వున్నారు.బెంగుళూరు ప్రభుత్వ కళాశాలో ఆచార్య పదవిని నిర్వహించి నివృత్తిని పొందారు. మంచి వ్యాఖ్యాతగా పేరు తెచ్చుకున్నారు. స్త్రీ సంవేదన ప్రధానంగా కవిత్వం రాస్తున్న రాజేశ్వరి మార్దవమైన అభివ్యక్తికి వర్తమాన నిదర్శనంగా వున్నారు.
బెంగుళూరు విశ్వవిద్యాలయం తెలుగు విభాగంలో మొదటి మహిళగా పిహెచ్‌.డి.ని పొందారు. రాజేశ్వరి తండ్రిగారు సుప్రసి ద్ధులైన దివాకర్ల వేంకటావధానిగారు అవడంవల్ల అటు ప్రాచీన సాహిత్యంపై పట్టును సాధించగలిగారు. ఆధునికసాహిత్యంపట్ల మమకారాన్ని, అనువాద రచనలపట్ల మక్కువను చూపగలుగు తున్నారు.
రచయిత్రుల మీద రాసిన కవిత ‘నిన్నటివాళ్ళు’ లో ‘రాసుకునేందుకు/ కాగితం కలమైనా లేకున్నా/ గడ్డిపోచనందుకుని/వెలుగుదారిని వెతికారు/గృహస్వేద మాధ్యమంలో/ అక్షరాలను ఒత్తిడి చేశారు/… బాలవితంతువులు/ఆత్మదు:ఖగాయాలను/ శరీరం పిట్టగోడ మీద ఆరేసుకున్నారు./.. మార్పు రావలసిన కాలాలకు/ సాక్ష్యంగా నిలిచారు’.
ఒక సామాజిక బాధ్యతగా రచనను స్వీకరించి స్త్రీల జీవితాల్లోని చీకటి కోణాలను, అసమానతలను వివరిస్తూ రచించడాన్ని సమర్ధించారు. ‘ఆత్మధైర్యం అవతరించాలి/..స్వయంసిద్థ వ్యక్తిత్వం/ నాతోడుగ నిలవాలి/ నేను ఒంటరిని కానని/ నిరూపించాలి/ అనేక పుట్టుకలతో నేను ఒక్కటి కావాలి, స్త్రీలలో ఏర్పడిన చైతన్యం శిశిరపు అంచుల్ని ఒడిసి పట్టుకొని కవిత్వీకరించారు.
పదవీ విరమణ రోజున తన మనస్సులోని మానసిక సంచలనాన్నింటినీ ‘మెట్లు దిగుతూ’.. కవిత్వంలో ఎంతో ఆర్ద్రంగా రచించారు. విదేశాలకు వలస వెళ్ళి పోయిన పిల్లల్ని తలుచుకుంటూ, శరీర మాత్రులు మిగిలున్న వాళ్ళు ‘ఊటలేని చిరునవ్వు’ని కంటి ముందు నిలిపారు. సాలీడు అల్లుకున్న గూట్లో/ తానే చిక్కుపడినట్లు/ అధిక ధరలను చుట్టూ పేర్చుకుని/ గుండెదడను పెంచుకుంటుంది/తరగతుల భావనను వదిలి/మనోగతిని దిద్దుకుంటే/వజ్రా యుధంకాదా/ మధ్యతరగతి మహిళ-జీవన నిర్ణయాన్ని తీసుకునే శక్తి స్త్రీలకుందని నిర్ణయ ప్రకటన చేస్తుంది. తనను తాను తరచి చూసుకున్నప్పుడే, నిజమైన వ్యక్తిత్వం ఏర్పడుతుందని భావించి- ‘నాతో నేను మాట్లాడుకునే/ సందర్భంలో మాత్రం/ నన్ను నేను నిలదీసుకుంటాను, అంటున్నారు? ‘ఆమె - అతడు’ వ్యంగ్య కవిత. కల్పనా చావ్లా మీదా, ఉద్యోగస్థురాలి పిల్లల ఒంటరితనం మీద, తండ్రిని కోల్పోయిన పిల్లల మానసిక స్థితిని, చిత్రిస్తూ కవిత లున్నాయి. చివరికి మిగిలేది? భూమి తడిపిన ఆకాశం, ఒకరినొకరు, రెండు అద్దాలు ఒకే దృశ్యం, పొద్దుటి వెన్నెల, అలిప్త బిందువు వంటి మంచి కవితలున్నాయి. చివరగా రాజేశ్వరి కవిత్యోద్దేశ్యాన్ని తెలిపిన మంచి కవితొకటుంది. ‘విరోధా భాసం’-అది. ‘నాలోపలి దిగులు, భయాలను / ఎదిరిస్తుంటాను/ శిఖరాలను ఎక్కాలని కాదు/ భూమిపై నా కాళ్ళను గట్టిగా నిలపాలని/ నేనంత దూరం నడవలేనని/ జాలి చూపిన వాళ్ళను దూరం నిలిపి/ ముందుకు పోవాలన్న /ధ్యేయంతో తలపడుతుంటాను?.
రాజేశ్వరి కవిత్వం ఒక భావోద్విగ్నతకు గురి చేస్తుంది. ఆమె ‘లో చూపు’, ‘చుట్టు చూపు’ ఆమె పరిణిత వ్యక్తిత్వాన్ని తెలియజేస్తుంది. మంచి అనువాదకురాలిగా పేర్గాంచిన ఆమె సాహితీ ప్రయాణం ఈ విరామ సమయంలో ద్విగుణీతమవ్వాలని ఆశిస్తున్నాను. సరళమైన భాషతో, చిక్కని భావాలతో, స్పష్టమైన అవగాహనతో రచించిన రాజేశ్వరి సర్వదా అభినందనీయురాలే.

Friday 30 September 2011

ఆకుపచ్చని కల-రాజేశ్వరి దివాకర్ల కవిత్వం

భూమిక September 2010
శిలాలోలిత
”కవిత్వం అభిరుచికి సంబంధించిన విశిష్ట కళ. రాయకుండా ఉండలేక పోవడమే కవిత్వానికి మూలసూత్రం. వచన కవిత్వానికి నిర్దిష్ట సూత్రాలంటూ ఏమీ లేవు. అంతరంగ మథనమే వచన కవితకు ఆధారం”- రాజేశ్వరి దివాకర్ల.
ఇవే భావాలతో నిత్య నూతనమైన కవిత్వ రచనలో కొత్త కోణాలను దర్శించాలనే తపన రాజేశ్వరిగారి కవిత్వంలో కనిపిస్తుంది. 2009లో ‘భూమి తడిపిన ఆకాశం’ అనే కవిత్వ సంపుటిని తీసుకొని వచ్చారు.
ఈమె ఉభయ భాషా కవయిత్రి. మూడు దశాబ్దాలుగా బెంగుళూరులోని తెలుగు సాహిత్య రంగంలో సృజనాత్మకమైన పాత్రను పోషిస్తున్నారు. తెలుగు కన్నడాల గురించి తులనాత్మకమైన వ్యాసాలు రాశారు. ఇంతకు ముందు ‘నీరు స్తంభించిన వేళ, ‘నక్షత్ర దాహం’- కవిత్వ సంపుటులను తీసుకొచ్చారు.ఈ మూడింటి పేర్లతో ప్రకృతి, ఆకాశం,నక్షత్రాలు, నీరు, సమయం, స్తబ్ధత, తృష్ణ, పిపాస, భూమి, ఆర్ద్రత మొదలైనవన్నీ స్పష్టంగా కనిపిస్తున్నాయి.
కేంద్ర సాహిత్య అకాడెమీ వారి ‘భారతీయ సాహిత్య నిర్మాతలు’ మాలికలో ఈమె రచించిన ‘అక్క మహాదేవి’ ప్రచురితమైంది. అలాగే ‘బసవన్న సమగ్ర వచనాలు’ తెలుగు అనువాదాన్ని అంబికా అనంత్‌తో కలిసి చేశారు. స్త్రీ శరణుల వచనాలు’ అనువాదంలో భాగస్వామ్యం వహించారు. రాజేశ్వరి బసవ సమితి వారి ‘బసవ పథం’ త్రైమాసిక తెలుగు పత్రికకు ప్రధాన సంపాదకులుగా వున్నారు. ‘చైతన్య కవిత’ పత్రికకు చేదోడుగా వున్నారు.బెంగుళూరు ప్రభుత్వ కళాశాలో ఆచార్య పదవిని నిర్వహించి నివృత్తిని పొందారు. మంచి వ్యాఖ్యాతగా పేరు తెచ్చుకున్నారు. స్త్రీ సంవేదన ప్రధానంగా కవిత్వం రాస్తున్న రాజేశ్వరి మార్దవమైన అభివ్యక్తికి వర్తమాన నిదర్శనంగా వున్నారు.
బెంగుళూరు విశ్వవిద్యాలయం తెలుగు విభాగంలో మొదటి మహిళగా పిహెచ్‌.డి.ని పొందారు. రాజేశ్వరి తండ్రిగారు సుప్రసి ద్ధులైన దివాకర్ల వేంకటావధానిగారు అవడంవల్ల అటు ప్రాచీన సాహిత్యంపై పట్టును సాధించగలిగారు. ఆధునికసాహిత్యంపట్ల మమకారాన్ని, అనువాద రచనలపట్ల మక్కువను చూపగలుగు తున్నారు.
రచయిత్రుల మీద రాసిన కవిత ‘నిన్నటివాళ్ళు’ లో ‘రాసుకునేందుకు/ కాగితం కలమైనా లేకున్నా/ గడ్డిపోచనందుకుని/వెలుగుదారిని వెతికారు/గృహస్వేద మాధ్యమంలో/ అక్షరాలను ఒత్తిడి చేశారు/… బాలవితంతువులు/ఆత్మదు:ఖగాయాలను/ శరీరం పిట్టగోడ మీద ఆరేసుకున్నారు./.. మార్పు రావలసిన కాలాలకు/ సాక్ష్యంగా నిలిచారు’.
ఒక సామాజిక బాధ్యతగా రచనను స్వీకరించి స్త్రీల జీవితాల్లోని చీకటి కోణాలను, అసమానతలను వివరిస్తూ రచించడాన్ని సమర్ధించారు. ‘ఆత్మధైర్యం అవతరించాలి/..స్వయంసిద్థ వ్యక్తిత్వం/ నాతోడుగ నిలవాలి/ నేను ఒంటరిని కానని/ నిరూపించాలి/ అనేక పుట్టుకలతో నేను ఒక్కటి కావాలి, స్త్రీలలో ఏర్పడిన చైతన్యం శిశిరపు అంచుల్ని ఒడిసి పట్టుకొని కవిత్వీకరించారు.
పదవీ విరమణ రోజున తన మనస్సులోని మానసిక సంచలనాన్నింటినీ ‘మెట్లు దిగుతూ’.. కవిత్వంలో ఎంతో ఆర్ద్రంగా రచించారు. విదేశాలకు వలస వెళ్ళి పోయిన పిల్లల్ని తలుచుకుంటూ, శరీర మాత్రులు మిగిలున్న వాళ్ళు ‘ఊటలేని చిరునవ్వు’ని కంటి ముందు నిలిపారు. సాలీడు అల్లుకున్న గూట్లో/ తానే చిక్కుపడినట్లు/ అధిక ధరలను చుట్టూ పేర్చుకుని/ గుండెదడను పెంచుకుంటుంది/తరగతుల భావనను వదిలి/మనోగతిని దిద్దుకుంటే/వజ్రా యుధంకాదా/ మధ్యతరగతి మహిళ-జీవన నిర్ణయాన్ని తీసుకునే శక్తి స్త్రీలకుందని నిర్ణయ ప్రకటన చేస్తుంది. తనను తాను తరచి చూసుకున్నప్పుడే, నిజమైన వ్యక్తిత్వం ఏర్పడుతుందని భావించి- ‘నాతో నేను మాట్లాడుకునే/ సందర్భంలో మాత్రం/ నన్ను నేను నిలదీసుకుంటాను, అంటున్నారు? ‘ఆమె - అతడు’ వ్యంగ్య కవిత. కల్పనా చావ్లా మీదా, ఉద్యోగస్థురాలి పిల్లల ఒంటరితనం మీద, తండ్రిని కోల్పోయిన పిల్లల మానసిక స్థితిని, చిత్రిస్తూ కవిత లున్నాయి. చివరికి మిగిలేది? భూమి తడిపిన ఆకాశం, ఒకరినొకరు, రెండు అద్దాలు ఒకే దృశ్యం, పొద్దుటి వెన్నెల, అలిప్త బిందువు వంటి మంచి కవితలున్నాయి. చివరగా రాజేశ్వరి కవిత్యోద్దేశ్యాన్ని తెలిపిన మంచి కవితొకటుంది. ‘విరోధా భాసం’-అది. ‘నాలోపలి దిగులు, భయాలను / ఎదిరిస్తుంటాను/ శిఖరాలను ఎక్కాలని కాదు/ భూమిపై నా కాళ్ళను గట్టిగా నిలపాలని/ నేనంత దూరం నడవలేనని/ జాలి చూపిన వాళ్ళను దూరం నిలిపి/ ముందుకు పోవాలన్న /ధ్యేయంతో తలపడుతుంటాను?.
రాజేశ్వరి కవిత్వం ఒక భావోద్విగ్నతకు గురి చేస్తుంది. ఆమె ‘లో చూపు’, ‘చుట్టు చూపు’ ఆమె పరిణిత వ్యక్తిత్వాన్ని తెలియజేస్తుంది. మంచి అనువాదకురాలిగా పేర్గాంచిన ఆమె సాహితీ ప్రయాణం ఈ విరామ సమయంలో ద్విగుణీతమవ్వాలని ఆశిస్తున్నాను. సరళమైన భాషతో, చిక్కని భావాలతో, స్పష్టమైన అవగాహనతో రచించిన రాజేశ్వరి సర్వదా అభినందనీయురాలే.

Wednesday 21 September 2011

జాలాది విజయ స్వచ్ఛమైన కవిత్వాక్షరాలు


భూమిక October 2010
శిలాలోలిత
డా.జాలాది విజయ ‘నగ్నాక్షరాలు’ అనే పేరిట కవితా సంపుటిని 2008లో వేశారు. రగులుతున్న దు:ఖంతో వున్న స్త్రీ ముఖ చిత్రంతో పోరాట పటిమను కనబరుస్తున్న దృశ్యాన్ని అక్బర్‌ అద్భుతంగా చిత్రించారు. కృష్ణాజిల్లా పులపర్రులో జన్మించిన ఈమె ప్రస్తుతం, శ్రీ సిద్ధార్థ విద్యా సంస్థలో తెలుగు లెక్చరర్‌గా ఉద్యోగం చేస్తున్నారు. తన కన్న తండ్రి జానపద మహాకవి ఐన ‘జాలాది’పై ఎం.ఫిల్‌, పి.హెచ్‌డి చేశారు.
ఈ కవిత్వంలో రకరకాల భావాల సమ్మేళనం వుంది. వస్తువైవిధ్యం వుంది. స్త్రీల సమస్యలపై జీవితాలపై రాసిన కవితలలో కత్తికంటె పదునైన భావతీవ్రత వుంది.భావగాఢతా వుంది. ప్రేమ, విరహం నిరీక్షణ వంటి కవితలు ప్రారంభంలో రాసినవై వుంటాయి. వాటిల్లో కొంత సరళత, మామూలు ధోరణే వున్నాయి. కానీ, స్త్రీల మానసిక ఘర్షణను చిత్రించేటప్పుడు మాత్రం కవయిత్రి విజయ ఒక ప్రవాహ వేగంతో రచిస్తూ, పోలికలపై పోలికలు చెబ్తూ పోయారు.
ముందుగా, ‘ఎందుకు’? కవిత గురించి మాట్లాడుకుందాం. మహిళా దినోత్సవాలు జరుపుకోవడం ఎందుకు? అని ప్రశ్నిస్తూ ఉధృతమైన ఆవేశంతో రాసిన కవిత ఇది. డబ్బున్న స్త్రీలపై, అగ్రకులాలలో వున్న స్త్రీల (కొందరు మాత్రమే, అంటే ఒకళ్ళిద్దరే)పై దాడి సరైంది కాదు. వస్త్రధారణ అనేది వ్యక్తిగతం. స్త్రీలందరం ఒకటనుకోవాలి. స్త్రీలకంటే ముందు మనం మనుష్యులం. మానవత్వం వున్న వ్యక్తులం. మనలో మనకి విభేధాలు సృష్టించాలను కునే వాళ్ళకు మన మాటలే ఆయుధాలౌతాయి. అతి ధోరణిని ప్రదర్శించే ఒకళ్ళిద్దరు స్త్రీల గాటన  అందరి స్త్రీలను కట్టడం ధర్మం కాదు. పుట్టుక మన చేతుల్లో లేదు. పుట్టిన తర్వాత ఎలా జీవిస్తున్నాం. ఎలాంటి భావాలున్నాయి అన్నది ప్రధానం. ఇంత మంచి పరిణితి వున్న కవయిత్రి గళంలో ఇలాంటి నిరసన బాధాకరం అన్పించింది. ‘నేను స్త్రీవాదిని కాను అమ్మవాదిని’ అని ప్రకటించారొక కవితలో. స్త్రీవాదమంటే అదొక  నేరమో, పాపమో, విశృంఖల జీవితమో కాదు. ఆత్మగౌరవ పోరాటం. మన చుట్టూ వున్న కోట్లాది స్త్రీల సమానత్వం కోసం, అస్తిత్వంకోసం, ఆర్థిక దోపిడీని నిరోధించడం కోసం, ఆరాట పడ్తూ పోరాడుతున్నదే స్త్రీవాదం. స్త్రీలలో వున్న బహురూపాల్లో అమ్మరూపం ఒకటి. మాతృత్వ ప్రదర్శన, త్యాగాల కిరీటాలు మోయడమే స్త్రీతత్వం కాదు. మానవత్వాన్ని స్త్రీ పురుషులిరువురూ నింపుకుని, సాటి మనుషులుగా గుర్తించమనే చెబ్తోంది. ఇవన్నీ విజయగారికి తెలియవని కాదు. ఈ దృష్టితో ఆలోచిస్తే, మనమంతా ఒకటనే భావన పెంపొందించుకొంటే ఇంకెన్నో మంచి కవితలు రాయాలని, రాస్తారని నా నమ్మకం. రావూరి భరద్వాజగారి ముందుమాటలో, డా. జయరావుగారి వెనకమాటలో కూడా  ”ఇది స్త్రీవాదం కాదు, అమ్మవాదం’ అంటూ ప్రస్తావించారు. అమ్మవాదం అంటే ఏమిటి? ప్రేమమయమైన స్త్రీ తత్వమనే కదా! స్త్రీవాదం అంటే స్త్రీ చైతన్యమే. స్త్రీల కొరకు పడే తపనే. స్త్రీల సమస్థితి కోసం పోరాటమే. మనని మనం అర్థం చేసుకునే తీరులోనే వుందంతా. పక్కవాళ్ళు రాళ్ళేయడం చూస్తూనే వున్నాం. మన మీద మనమే రాళ్ళేసుకోవద్దనేదే నా భావన.
బతకడానికే రోజుని కోల్పోయిన స్త్రీలు, అలమటిస్త్తూ, ఆరాటపడ్తూ, పోరాడుతున్న స్త్రీలు, తమ విజయాల్ని, తాము సాధించుకున్న హక్కుల్ని తాము పొందుతున్న భావస్వేచ్ఛనూ, నిర్ణయ ప్రకటనల్ని వెలిబుచ్చుకునే రోజుగా, తాము సాధించుకున్న రోజుగా మహిళా దినోత్సవాన్ని ఎందుకు అనుకోకూడదు?
విజయ తన కవిత్వతత్వాన్ని గురించి ఎంతో భావోద్వేగంతో ‘జ్వాలితాక్షరాలు’ అంటూ చెప్పారు.’నడిబొడ్డున పెట్టిన పొలికేక హోరు నా జాతి గుండెలో మండుతున్న అగ్ని కణాల జ్వాల మదిని ముంచుతున్న కన్నీటి ప్రవాహాల సుడిగుండాల ఉప్పెన. క్షణక్షణం వేధిస్తూ నా చుట్టూ ముసురుకున్న జవాబులేని ప్రశ్నలు. మానవత్వాన్ని ప్రశ్నిస్తున్న మనస్సు మూలుగు నాతోబుట్టువుల రుధిరాక్షర సంతకాలే ఈ ‘నగ్నాక్షరాలు’. నాలో ఉబుకుతున్న.. ఉరుకుతున్న ఎర్రకణాల ఉప్పెనే ఈ ‘నగ్నాక్షరాలు’. ఆక్రోశంతో అలసిన మనసుతో మీ ముందుకు వస్తున్న అలుపెరగని పోరాటం చేస్తున్నా. సరిలేని నెత్తుటి బిందువుని సవరించే చిరు ప్రయత్నం.’ ఆమెకున్న సంస్కారం, తపన, ఆర్తి, వినయం మన కిందులో ప్రస్ఫుటమౌతున్నాయి.
విజయ వాళ్ళ నాన్న మీద రాసిన కవిత ‘రుద్రాక్షరం’. అత్యుత్తమైన జానపద సాహిత్యాన్ని అద్భుతంగా రచించిన ప్రజలకవి ఆయనంటే నాకెంతో గౌరవం కూడా. ‘బొడ్డు పేగు తెగిపడ్డ రోజు తెలుసుకో/ గొడ్డు కాదు ఆడదనే గుణం తెలుసుకో’-లాంటి వాస్తవ సత్యాలెన్నింటినో ఎంతో కరుణార్ద్రంగా వెల్లడించారు.
ఆశ, ఆఖరి ప్రయాణం, నీలాగే , రాజీనామా, నమ్మకం మోసపోయింది, శూన్యమైన మనస్సు మీద, మృత్యుతరంగాలు, కలల మేడలు, అంతిమ విజయం ఎవరిది? ఎదురు చూపు, అమృతవర్షం, నా అక్షరాల సాక్షిగా వంటి మంచి కవితలెన్నో ఇందులో వున్నాయి. ‘మరో ప్రపంచంకోసం’ కలలు కంటూ ఆశావహ దృక్పథంతో ఈ కవయిత్రి ఎదురు చూస్తోందిలా.
‘ఇంకిన బిందువులా/ ఇంకుతున్న బంధువులా/ జంకులేని నెత్తురు బిందువులా/ మరో ప్రపంచంకోసం/ ఎదురుచూస్తున్నా!

Wednesday 7 September 2011

కవిత్వ కలనేత - సుహాసిని

భూమిక December 2009
 శిలాలోలిత
 ’నేను జీవితంలో ఓడిపోయిన ప్రతీసారి నన్ను ఓదార్చింది, గెలిచిన ప్రతీసారి నా భుజం తట్టింది ఈ అక్షరాలే’ - అని డా|| లక్ష్మీసుహాసిని తన అంతరంగ చిత్రాన్ని మన ముందు ఉంచారు . గతంలో ‘దామదచ్చియ’లో అనే పాటల సంకలనాన్ని కూడా తీసుకొచ్చారు . సుహాసిని తల్లి ‘దర్భా భాస్కరమ్మ’ సాహిత్యరంగంలో గణనీయమైన కృషిచేయడం వల్ల, కేవలం సుహాసినికి  లోకానికి పరిచయం చేయడమేకాక, కవితాక్షరాలను కూడా యిచ్చిన ఖ్యాతి భాస్కరమ్మ గారిది.
 అందుకే సుహాసిని జీవితంలో సాహిత్యం కలగలిసి పోయింది. స్త్రీలపై ఎంతో ఆర్ద్రతతో ఆవేదనతో రాసిన కవితలనేకం. స్త్రీలలో ఆత్మగౌరవాన్ని, దృఢత్వాన్ని కోరుకుందామె.
 ’ఆడవారిమీద సాగే ప్రతీ అణచివేతా అత్యాచారాల మీద
 అక్షరయుద్ధం సాగిస్తాను’ - అంది. (ఆసూంకి కసమ్‌)
 ’మా మెడలు వంచి మూడుముళ్ళు వేశారు నిన్న ఆ మెడలు కోసి ప్రేమించవేం? అంటున్నారివాళ.’ - (రివాజు)
 ఇప్పుడు చెలరేగుతున్న ప్రేమోన్మాదుల ఘాతుకాలన్నింటినీ ఈ అక్షరాలలో పొదిగిన్దీమే .
 ’అందరికీ నువ్‌ తలలో నాలుక
 నీ నాలుక తడారిపోడం మాత్రం ఎవరికీ పట్టదు
 అందరి నవ్వులకూ ఆలంబన నువ్వు
 కానీ ఎవరికీ పట్టదు కరవైన నీ నవ్వు’ (ఓ గృహిణి మాత్రమే)
 ఇలా ఎంతకాలం నుంచో మగ్గిపోతున్న స్త్రీల జీవితాలను ఆవిష్కరిస్తూ - ఇంకో కవితలో..
 ’ఉద్వేగాలను అదుపు చేసుకునే
 చైతన్యాన్ని కోల్పోతున్న మీ పురుషాహంకారం మీదనే
 మా నిరసన
 మాతో చెయ్యి కలిపి పోరాడాల్సిన మీరు
 మీ జాత్యహంకారం విడిచి మా నినాదాన్ని వినండి
 మేం ముక్త కంఠంతో గర్హిస్తున్నాం
 ’ఇంకానా ఇకపై సాగదని’ -
 చాలా స్పష్టమైన అవగాహన వున్న కవయిత్రి అవడంవల్ల పురుషులమీద కాదు విమర్శ - పురుషాహంకారం పట్లనే మా నిరసన అంటుంది.
 మానవస్వభావాల్లో మార్పు రావాలని, స్త్రీపురుషలిరువురూ సమానులనీ, స్త్రీలపై హింస ఇంకా కొనసాగకూడదనీ - ఆశావహ దృక్కోణాన్ని కవిత్వీకరించింది.
 లెక్చరర్‌గా ఉద్యోగం చేస్తూండడంవల్ల విద్యార్థులతో సన్నిహితంగా మెసిలే వీలున్నందువల్ల విద్యావిధానంపై కొన్ని కవితలున్నాయి. పాఠ్యాంశాలలోని లోటుపాట్లనీ, అవి చెప్పాల్సి రావడం పట్ల నిరసననీ, విద్యార్థుల మనోవికాసాలకు పనికిరాని పాఠాల్ని కూడా, ఎంతో కష్టపడి మార్చి చెప్పాల్సివస్తున్న స్థితినీ, వాటిని కూడా విద్యార్థులలో విలువల్ని పెంచే దిశగా బోధిస్తున్న విధానాన్ని కవిత్వంలో చెప్పారు .
 ’చెలకుర్తి’ సంఘటనపై స్త్రీలపై హింస పరాకాష్టను చేరుకున్న దృశ్యాన్నీ, కోల్పోతున్న బాల్యాల్నీ, విప్లవమే, ఆ మార్గమే సమస్థితిని తీసుకొస్తుందన్న నమ్మకాన్నీ, ద్రోణాచార్యుడు నరికిన బొటనవేలు గురించి కాదు - ‘చిటికినవేలు కుట్ర’ సంగతేమిటి? ఆ రోజునుంచీ స్త్రీల స్వేచ్ఛ, సంతోషం ఆఖరంటుంది. పసిపిల్లల దైన్యస్థితినీ, పసిపిల్లల బండెడు పుస్తకాల్నీ, రైతుల కడగండ్లు కురిసే వడగండ్లనూ, ఇలా వివిధ సామాజికాంశాలన్నింటినీ కవిత్వంగా  మలిచింది.
 ’రెక్కలు పొదిగిన చూపు’ - పేరు కవిత్వ సంకలనానికి పెట్టడంలోనే, ఒకరికన్ను మరొకరికి ఎలా వెలుగవుతుందో, చెప్తూనే, చూపు సాధించుకున్న స్వేచ్ఛనూ, మరణరాహిత్యాన్ని చెప్పింది. భావస్వేచ్ఛ సాధించినప్పుడు, స్త్రీలు సంఘటితమై బలోపేత మైనప్పుడూ, పురుషుల స్వభావాల్లో పరిపూర్ణమైన మార్పు వచ్చినప్పుడూ, మనం కలలు కనే భావిజీవితం మనముందే ఉందని చెప్పిన ఆశావాది సుహాసిని.